BREAKING : ఈనెల 24న కాంగ్రెస్ లో చేరనున్న డి. శ్రీనివాస్

-

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆయన చేరిక పై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను జగ్గారెడ్డి లాంటి కీలక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే తాజాగా దీనిపై మరోసారి క్లారిటీ వచ్చింది.

జనవరి 24వ తేదీన కాంగ్రెస్ పార్టీలో…. ధర్మపురి శ్రీనివాస్ చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో… జనవరి 24వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు డిఎస్. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ధ్రువీకరించింది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు గా పనిచేశారు డి శ్రీనివాస్. అలాగే పార్లమెంటు సభ్యులుగా కూడా డి.శ్రీనివాస్ పనిచేశారు. అయితే తెలంగాణ ఏర్పడ్డతరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరిన డి ఎస్.. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక గత కొన్ని రోజుల నుంచి టిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news