మాదాపూర్ లో బోర్డు తిప్పేసిన డన్యోన్ ఐటీ టెక్నాలజీ

-

మాదాపూర్ లో డన్యోన్ ఐటీ టెక్నాలజీ సంస్థ బోర్డు తిప్పేసింది. వందమంది పైబడి ఉద్యోగుల నుంచి లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేసింది ఈ సంస్థ. ఫేసుబుక్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావాలంటూ ప్రకటనలు చేశారు. ఈ ప్రకటన నమ్మి మోసపోయారు నిరుద్యోగులు. టెలిఫోన్ లోనే ఇంటర్వ్యూ చేసి ఆఫర్ లెటర్ జారీ చేసారు మోసగాళ్లు. ఆన్లైన్ లోనే ట్రైనింగ్ ఇచ్చిన మోసగాళ్లు శిక్షణ అనంతరం ప్రాజెక్ట్ ఇస్తామంటూ నమ్మబలికారు.

ఒక్కో వ్యక్తికి 4 లక్షలు ప్యాకేజీ ప్రకటించింది కంపెనీ. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు బాధితులు. ప్రాజెక్ట్ ఇస్తామంటూ నమ్మబలకి కాలయాపన చేసారు కంపెనీ ప్రతినిధి ప్రతాప్ కట్టమూరి. మోసపోయామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కంపెనీ ప్రతినిధి ప్రతాప్ పారిపోతుండగా పట్టుకున్న బాధితులు మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news