రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామ పరిధిలోని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా చెబుతున్న ఫాంహౌస్లో ఈ నెల 11న పట్టుకున్న పందెం కోళ్లకు సోమవారం రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో వేలం నిర్వహించారు.
కోళ్లను దక్కించుకోవడానికి సుమారు 73 మంది వచ్చినట్లు సమాచారం. మొత్తం 84 కోళ్లను తొమ్మిది రౌండ్లలో వేలం వేయగా.. రూ.16 లక్షల 65 వేలు ధర పలికాయి. సగటున ఒక్కో కోడి రూ.19 వేల 821 ధర పలికినట్లు సమాచారం. వేలం పాట ముగిసిన పది నిమిషాల్లోనే డబ్బులు కట్టాలన్న నిబంధన ఉండటంతో అందరూ డబ్బుల సంచులు పట్టుకుని కోర్టుకు వచ్చినట్లు తెలిసింది.
ఒక్కో పందెం కోడి 19 వేలు .. ఎమ్మెల్సీ పోచంపల్లి ఫాంహౌస్లో దొరికిన కోళ్లకు కోర్టులో వేలం
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామ పరిధిలోని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి చెందినదిగా చెప్తున్న ఫాంహౌస్లో ఈ నెల 11న పట్టుకున్న పందెం కోళ్లకు సోమవారం రాజేంద్రనగర్… pic.twitter.com/wwQg7YpLjp
— ChotaNews App (@ChotaNewsApp) February 18, 2025