అసోంలో భూప్రకంపనలు.. రిక్టర్‌స్కేలుపై 4.2 తీవ్రత!

-

భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఒక్కసారిగా భూమి కంపించింది.ఉత్తర-మధ్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బ్రహ్మపుత్ర రివర్ ఉత్తర ఒడ్డున ఉదల్‌గురి జిల్లాలో ఉదయం 7:47 గంటలకు భూమి కంపించగా.. 15కి.మీ. లోతులో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక పేర్కొంది.

గౌహతి నుంచి ఉత్తరాన 105కి.మీ అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో తేజ్‌పూర్‌కు పశ్చిమాన 48 కిలోమీటర్ల దూరంలో కచ్చితమైన కేంద్రాన్ని గుర్తించారు. దర్రాంగ్, తముల్‌పూర్, సోనిత్‌పూర్, కమ్రూప్, బిస్వనాథ్ జిల్లాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం. పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు తూర్పు భూటాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం రావొచ్చని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version