బ్రేకింగ్ : విశాఖలో భూ ప్రకంపనలు..పరుగులు తీస్తున్న ప్రజలు

-

విశాఖ లో మహానగరంలో ఇవాళ వేకువ జామున కలకలం చోటు చేసుకుంది. విశాఖ లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చాలా ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది. భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతోనే… ఇళ్ల నుంచి బయటకు వచ్చారు ప్రజలు. విశాఖ లోని మురళీ నగర్‌, బీచ్‌ రోడ్డు, కంచర పాలంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

భూ ప్రకంపనలు చోటు చేసు కోవడంతో.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా… ప్రజలు అందరూ ఒక్క సారిగా రోడ్డు ఎక్కారు. ఈ సంఘటన ఇవాళ వేకువ జామున చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రజలు అందరూ నిద్రలో ఉన్న సమయం లోనే… భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ సమాచారం తెలిసిన… అధికారులు… దీనికి కారణాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news