ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ఈసీ ఆరా

-

నిన్న విజయవాడలో సీఎం జగన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు.కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి దగ్గర గాయమైంది.రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది. అయితే ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించింది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఏకంగా ముఖ్యమంత్రిపై దాడి జరగడమేంటని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలు జరుగుతున్న నేపథ్యంలో సీఈసీ ఆందోళన వ్యక్తం చేస్తూ.. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన కొందరు పోలీస్‌ అధికారులపై సీఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.జగన్‌ రోడ్‌ షోలో జరిగిన ఘటనపైనా సంబంధిత అధికారులపై సీఈసీ చర్యలు తీసుకునే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news