రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ

-

ఓటర్ల జాబితా సవరణ, ఓటు నమోదు  ప్రక్రియ ల గురించి నేడు రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ముందస్తు ప్రచారం, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్ కుమార్ బుధవారం  అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు వచ్చే వారు కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈసీ తెలిపింది.  ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించిన విషయం తెలిసిందే.. వాటిపై ఏదేని అభ్యంతరాలు, వినతులను అక్టోబర్ నెలాఖరు వరకు ఎన్నికల సంఘం స్వీకరించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news