మ్యాచ్‌ ఫిక్సింగ్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు

-

మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఓ వైపు భానుడు భగభగమండి పోతుండగా.. మరోవైపు నేతల మాటలు కూడా హీట్ పెంచేస్తున్నాయి. అధికార-ప్రతిపక్ష నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయము రసవత్తరంగా మారింది.

దీంతో ఆయా పార్టీల నేతలు ఎలక్షన్ సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి.తాజాగా రాహల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. ఎటువంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లేకుండా బీజేపీకి 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమని రాహుల్‌ గాంధీ అన్నారు.దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ పార్టీ నేతలు కోరారు.ఢిల్లీ వేదికగా ఆదివారం ఇండియా కూటమి చేపట్టిన మహా ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్ ఎన్నికలు మ్యాచ్‌ ఫిక్సింగ్ జరిగాయని ఆయన ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఎన్నికల సంఘంలో తన మనుషుల్ని పెట్టుకుందని విమర్శించారు. అలాగే ఈవీఎంల విశ్వసనీయతను కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత రాజ్యాంగంలో మార్పులు చేస్తారని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news