శివసేన ఎల్పీ నేతగా ఏక్‌నాథ్ షిండే నియామకం

-

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా నియమించారు. అలాగే చీఫ్ విప్‌గా తిరుగుబాటు నేత భరత్ గొగవాలేను నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. కాగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన అజయ్ చౌదరీని నియమించడాన్ని స్పీకర్ తిరస్కరించినట్లు సమాచారం. ఈ మేరకు మహారాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ నియామక పత్రాన్ని విడుదల చేశారు.

సీఎం ఏక్‌నాథ్ షిండే
సీఎం ఏక్‌నాథ్ షిండే

సీఎం ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీలో ఇప్పటికే తన బలాన్ని నిరూపించుకున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆదివారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల్లో నియామకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న బలపరీక్షల్లో షిండే వర్గమే విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ కొత్త స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్‌ను ఎన్నుకున్నారు. నర్వకర్‌కు మద్దతుగా 164 మంది ఓటేశారు. మండలి చైర్మన్‌గా ఎన్సీపీ నేత రామ్‌రాజే నియమితులయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news