ఆ ఇద్దరికి నోటీసులు జారీ చేసిన ఈసీ

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ రాజకీయ పార్టీల నేతల వైఖరిపై కన్నెర్ర చేస్తుంది.  అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలను రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్న తరుణంలో ఈసీ వారి మాటలకు సమాధానం అడుగుతోంది. ఇందులో భాగంగానే మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి, వంటేరు ప్రతాప్‌ రెడ్డి, తెదేపా నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డిలు .. వ్యక్తిగత దూషణలకు చేసుకోవడంతో ఈసీ వారికి  నోటీసులు జారీ చేసింది.  నోటీసులకు 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయన వారిని రజత్ కుమార్ ఆదేశించారు. గత రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలు తెరాస నేతలను విమర్శించగా..తిరిగి వారు ప్రతివిమర్శలు చేయడంతో ఈసీ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news