BREAKING : ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల నోటీసులు..ఫిబ్రవరి 7 నుంచే సమ్మె

-

ఏపీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చారు ఉద్యోగ సంఘాల నేతలు. కాసేపటి క్రితమే సచివాలయానికి వచ్చిన పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీకి.. ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. జీఏడీ సెక్రటరీ శశి భూషణ్‌ కు సమ్మె నోటీసులు ఇచ్చారు ఉద్యోగ సంఘాల నేతలు.

పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలనే ముఖ్యమైన డిమాండ్‌ తో సమ్మె నోటీసు ఇచ్చారు ఉద్యోగులు. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్నాకే సమ్మెకు వెళుతున్నామని ప్రకటించారు ఉద్యోగ సంఘాల నేతలు. ఇక ఈ నోటీసుల ప్రకారం.. ఫిబ్రవరి 7 వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.

ట్రెజరీ ఉద్యోగులు మెడ మీద కత్తి పెట్టడం వల్ల నోటీస్ పీరియడ్ కు అర్థం ఉండదని… అలానే చేస్తే ఉద్యోగులను ప్రభుత్వం క్రమశిక్షణ లో పెట్టె ప్రక్రియ ప్రారంభం అవుతుందని అటు సజ్జల రామకృష్ణ రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చ చెప్పే ప్రయత్నం లో భాగంగా ఈ కమిటీ అని.. దానిలో భాగంగా వారిని రావల్సిందిగా నిన్న సమాచారం ఇచ్చామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news