ఆఖరి గింజ వరకు కొంటాం – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

-

ఆఖరి గింజ వరకు కొంటామని ప్రకటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీజేపీ పార్టీ ప్రభుత్వాలను కూల్చే పని పెట్టుకుందని.. తెలంగాణ పై కక్ష కట్టిందని ఆగ్రహించారు. కేంద్ర మంత్రులు అబద్ధాలు మాట్లాడుతున్నారని.. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయిదు వందల పెన్షన్ కూడా రావడం లేదని వివరించారు. రైతులు పండించిన ప్రతి గింజను మన ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు.

ప్రతి ఏటా 3 వేల కోట్లు నష్టం వచ్చినా భరిస్తూ, సీఎం కెసిఆర్ కొనుగోలు చేస్తున్నారని..లట్టుంగాడు, పొట్టుంగాడు వచ్చి వరి వేయమన్నరు. తీరా టైం కు చేతులు ఎత్తేసిండ్రని ఆగ్రహించారు. చేసేది లేక మళ్ళీ సీఎం కెసిఆర్ గారే రైతులు నష్ట పోవద్దని ధాన్యం కొంటున్నాడని.. పక్క రాష్ట్రాల రైతులు మన రాష్ట్రంలో పుట్టనందుకు బాధ పడుతున్నారని పేర్కొన్నారు. కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర చేసిందని..ఎవరైనా వచ్చి రెచ్చ గొడితే తెచ్చి పోవద్దన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news