ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్ చేతుల్లో ‘ఈటీ’

-

క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ వంటి అద్భుత‌మైన చిత్రాల్లో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసిన కోలివుడ్ స్టార్ సూర్య నెక్ట్స్ మూవీ ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ది. స‌న్ పిక్ష‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మాత‌గా పాండిరాజ్ ద‌ర్శ‌కత్వంలో వ‌స్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం ఈటీ ఎథ‌ర్కుం తునింధ‌వ‌న్ తో సూర్య థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌బోతున్నాడు. తాజాగా ఈ చిత్రం హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా టాలీవుడ్ ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ అండ్ డిస్ట్రిబ్యూష‌న్ హౌస్ ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్ ప్ర‌యివేటు లిమిటేడ్ ఈ సినిమా తెలుగు హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. సూర్య‌కున్న భారీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తెలుగులో ఈటీ పేరుతో విడుద‌ల చేయ‌బోతుంది. ఈ చిత్రం హ‌క్కుల‌ను ఫ్యాన్సీ ధ‌ర‌కు ఏషియ‌న్‌సంస్థ సొంతం చేసుకున్న‌ద‌ట. త‌మిళ వెర్ష‌న్‌తో పాటు తెలుగులో కూడా చిత్రం మార్చి 10న ఒకేసారి విడుద‌ల కానున్న‌ది. ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్, డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న ప్రియాంక అరుల్ మోహ‌న్ న‌టించింది. విన‌య్‌రాయ్‌, స‌త్యరాజ్‌, రాజ్‌కిర‌న్‌, శ‌ర‌ణ్య వంటి న‌టులు కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news