బీజేపీ మేడ్చల్ అభ్యర్థిగా ఈటల జమున..?

-

ప్రారంభం నుంచి ఈటల కుటుంబానికి మేడ్చల్ నియోజకవర్గానికి సమీప సంబంధాలు ఉండటంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున మేడ్చల్ నుంచి హుజూరాబాద్ ఎమ్మెలయేఈటల రాజేందర్ సతీమణి జమునను రంగంలోకి దించేందుకు ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈటల రాజేందర్ మేడ్చల్ మండలపరిధిలోని పూడుర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్నారు.

ఆయన గోదాంలు, గతంలో పౌల్ట్రీలు, వ్యాపారాలు నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో వారి కుటుంబానికి మేడ్చల్ కి చాలా రోజులుగా సత్సంబంధాలు ఉన్నాయి. జమున నివాసం పూడూర్ పరిధిలో ఉండటంతో పాటు స్థానిక నాయకులతో పరిచయాలున్నాయి. ఈటలకు అర్థబలం పరిపుష్టిగా ఉండటం.. టికెట్ ఆశిస్తున్న మిగతా వారికి ఆ బలం లేకపోవడం.. రాజేందర్ బీసీ అయినా జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. ఆ సామాజిక వర్గం పెత్తనం మేడ్చల్ ఎక్కువగా ఉండటంతో ఆమె అభ్యర్థిత్వం తమకు కలిసి వస్తుందని బీజేపీ అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news