ఆధిక్యంలో ఈటెల…”ఆర్ఆర్ఆర్” పోస్టర్ వైరల్..!

-

హుజరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయితే మొదటి నుండి వరుసగా ఏడు రౌండ్లలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అయితే 8వ రౌండ్ లో మాత్రం టిఆర్ఎస్ కు స్వల్ప లీడ్ వచ్చింది.

హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా ఆర్ఆర్ఆర్ అంటూ పలువురు బీజేపీ నాయకులు ప్రచారంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈటల రాజేందర్ ఆదిక్యం లో దూసుకుపోతున్న వేళ ఆర్ఆర్ఆర్ పోస్టర్ వైరల్ అవుతోంది. 2018 ఎన్నికల్లో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అదేవిధంగా దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన బిజెపి నేత రఘునందన్ అదేవిధంగా హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసిన ఈటల రాజేందర్ ఫోటోలతో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇక హైదరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ముగ్గురు కలిసి టిఆర్ఎస్ మెడలు వంచుతారని ఎంపీ అరవింద్ కూడా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news