ఈటలకు షాక్‌.. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం..

-

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌.. ఇండియా, పాక్‌ మ్యాచ్‌ ను తలపిస్తున్నాయి. కౌంటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి… ఏడో రౌండ్‌ వరకు బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యం ప్రదర్శించారు. అయితే…కౌంటింగ్ ఎనిమిదో రౌండ్‌ లో ఊహించని పరిస్థితి నెలకొంది. ఈ ఎనిమిదో రౌండ్‌ లో బీజేపీ పార్టీ పై టీఆర్‌ఎస్‌ పార్టీ 162 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించింది.

టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ మరియు టీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌ రెడ్డి సొంత గ్రామాల ఓట్లను ఈ ఎనిమిదో రౌండ్‌ లో కౌంటింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యం లోనే 162 ఓట్ల ఆధిక్యాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ సాధించింది. ఎనిమిది రౌండ్‌ లో బీజేపీ పార్టీ కి 4086 పోల్‌ కాగా… అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి 4248 ఓట్లు పోల్‌ అయ్యాయి. అయితే.. ఎనిమిదో రౌండ్‌ లో 162 ఓట్ల ఆధిక్యాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ సాధించినప్పటికీ… ఓవరాల్‌ గా చూస్తే… 3270 ఓట్ల ఆధిక్యంలో ఈటల ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news