ఆ తర్వాత కూడా ఆయనే మా ప్రధాని అభ్యర్థి : అమిత్ షా

-

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒక వేళ బీజేపీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోడీని కొద్దిరోజులకే దించేస్తారని.. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.

బీజేపీ పార్టీ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల వయస్సు నిండిన వారికి పార్టీలో ఎలాంటి పదవులు ఉండవు. అందుకే 2027 తో మోడీకి 75 వ ఏటా అడుగు పెడతాడు. దీంతో బీజేపీ అధికారంలో వస్తే మోడీ స్థానంలో మరో వ్యక్తి ప్రధాని అవుతారని అరోపణలు వస్తున్నాయి. ఇక దీనిపై స్పందించిన మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మోడీని తమ ప్రధానిగా ఎన్నుకుంటున్నారు. జూన్ 4 ఫలితాల తర్వాత ఆయనే ప్రధాని అవుతారు.2029 వరకు మోడీ నే భారత ప్రధానిగా కొనసాగుతారు. ఆ తర్వాత కూడా ఆయనే మా ప్రధాని అభ్యర్థిగా ఉంటాడని అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే బెంగాల్ లో ఈ సారి బీజేపీ 24 నుంచి 30 ఎంపీ స్థానాలు గెలుస్తుందని జోస్యం చెప్పారు.అలాగే ఈ ఎన్నికల్లో మేము సౌతిండియాలో సాధించే ఎంపీ స్థానాలు.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గెలిచే స్థానాల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news