మోదీ తెచ్చే ప్రతి పథకం ఆదాని, అంబానీల కోసమే: గీతారెడ్డి

-

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలతో గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి మాట్లాడుతూ.. అగ్నిపధ్ పై పార్లమెంటులో చర్చించకుండా యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మోడీ ప్రతి పథకం తన స్నేహితులు అదాని, అంబానీల కోసమే అని అన్నారు. అగ్నిపధ్ తో సైనికుల వ్యవస్థను కాంట్రాక్టు పద్ధతి చేస్తున్నారని, దేశ భద్రతను ఫనంగా పెడుతున్నారన్నారు.

పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని నాలుగు సంవత్సరాల వరకే తీసుకోవడం అన్యాయమన్నారు.అగ్నివీర్ లని నాలుగు సంవత్సరాల తర్వాత రోడ్డు మీద పడేసే కుట్ర జరుగుతోందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో టిఆర్ఎస్ పోలీసులు కాల్చి చంపితే.. ఆ శవానికి వాళ్ళ జెండా వేసే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్ర ఇంటిలిజెంట్ పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. అది అగ్నిపధ్ కాదు అగ్ని పరీక్ష అని విమర్శించారు. రైతు నల్ల చట్టాలు ఏ విధంగా విరమించుకున్నారో.. అగ్నిపధ్ ని అదే విధంగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గీతారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news