తెలంగాణలో భారత్ జోడో యాత్రకు ప్రతి ఒక్కరూ తరలిరావాలి – మధుయాష్కి గౌడ్

-

తెలంగాణాలో భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు కదలిరావాలని పిలుపునిచ్చారు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. యాత్రలో రాహుల్ గాంధీతో పాటు సామాజికవేత్త యోగేంధర్ యాదవ్ కూడా పాల్గొంటున్నారని తెలిపారు. దేశాన్ని కులం, మతం పేరుతో విడదీస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ పాదయాత్రకు రాష్ట్రంలో మద్దతు ఇవ్వడానికి సివిల్ సొసైటీ ముందుకొచ్చారని తెలిపారు.

దేశాన్ని ఐక్యంగా ఉండడానికి ఇవ్వాళ రాహుల్ యాత్ర చేస్తున్నారని అన్నారు. అలాగే సామాజికవేత్త యోగేంధర్ యాదవ్ మాట్లాడుతూ.. విభజన పేరుతో కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. రాహుల్ దేశాన్ని యూనిటీగా ఉంచడానికి యాత్ర చేస్తున్నారని అన్నారు. దేశంలో క్రోనీ క్యాపిటలిజం నడుస్తోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. రాహుల్ యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుకుంటున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news