కెసిఆర్ కు అందరం అండగా ఉండాలి – తుమ్మల

-

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం బీరాపల్లి గ్రామంలో బిఆరెఎస్ పార్టీ ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొన్నారు మాజీ మంత్రి తుమ్మల‌ నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడు అవకాశం వచ్చినా భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నేను, సండ్ర కృషి చేశామన్నారు. అత్యంత కరువు మండలం వేంసూరు మండలం అని.. అలాంటి ప్రాంతానికి బేతుపల్లి కాలువ ద్వారా తన హయంలో నీళ్ళు అందించామని తెలిపారు.

tummala nageswara rao

మీ చేరువులల్లోకి గోదావరి నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళతో మీ కళ్ళు కడుగుతానన్నారు. పంటలను గిట్టుబాటు ధర తో కొనుగోలు చేస్తున్న ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అన్ని హర్టికల్చర్ పంటలకు మన ప్రాంతం నిలయంగా మారాలన్నారు. సొంత నిధులతో రైతాంగం ను అధుకునే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా బాధ్యతలు తీసుకున్న కేసీఆర్ కు అందరం అండగా ఉండాలన్నారు. కేసీఆర…

Read more RELATED
Recommended to you

Latest news