బీఆర్ఎస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ రెబల్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన ప్రసంగిస్తూ.. తిండి లేకపోయినా ఉంటా కానీ, ఆత్మగౌరవం దెబ్బతింటే భరించలేనని సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. ఈ విషయాన్ని సమాజానికి చెబుదామనే ఖమ్మం తాను వచ్చినట్లు వెల్లడించారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంచి పనిచేస్తున్నారని ప్రశంసించారు జూపల్లి.

తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానో లేదో పార్టీనే చెప్పాలని విమర్శించారు. పార్టీలో ప్రాధాన్యత కోసం ఎప్పుడు కూడా తాను పాకులాడలేదని తెలిపారు. తనకు పదవులపైన అసలు ఆశ లేదని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాజకీయాల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు జూపల్లి. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు రావాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మాతో ఎవరు కలిసి వచ్చినా పనిచేస్తామని అన్నారు. సభా వేదికపై మరిన్ని విషయాలు చెబుతానంటూ అన్నారు జూపల్లి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version