సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసంతో మాజీ మంత్రి తలసాని ఎంట్రీ!

-

సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో గల ముత్యాలమ్మ ఆలయంలో కొందరు గుర్తుతెలియని దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.దీంతో సికింద్రాబాద్ పరిధిలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. పరిస్థితులు చేజారకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతవిద్వేషాలను ప్రేరిపించే వారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విగ్రహ ధ్వంసం తీరుపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడానికే ఇలా చేశారని ఆయన ఫైర్ అయ్యారు. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదని మాజీ మంత్రి పోలీసులను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news