ఫ్యాక్ట్ చెక్: 500,000 ఫ్రీ ల్యాప్ టాప్స్ ని పంచుతున్న ప్రభుత్వం…?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

 

ఒక వెబ్సైట్ లింక్ వచ్చి టెక్స్ట్ మెసేజ్ తో పాటుగా సోషల్ మీడియా లో వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ల్యాప్టాప్లు ఇస్తోందని ఆ వార్తలో ఉంది. అయితే నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకు వచ్చిందా..? ఫ్రీ లాప్టాప్ స్కీమ్ 2022 తో ఫ్రీగా పంచుతోంద..? ఇక ఈ వార్తల్లో నిజం ఎంతో అనేది చూస్తే… ఇది ఫేక్ వార్త అని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజం లేదు. ఇది నకిలీ వార్త మాత్రమే కనుక ఇటువంటి వార్తలతో జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా స్కీమ్స్ ని నమ్మకండి పైగా చాలా మంది ఇటువంటి ఫేక్ వార్తల్ని షేర్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఇతరులు కూడా మోసపోతూనే ఉంటారు కాబట్టి అది నిజమని తెలిసే వరకు షేర్ చేయద్దు.

Read more RELATED
Recommended to you

Latest news