ఫ్యాక్ట్ చెక్: పునీత్ రాజ్ కుమార్ మరణం పై డాక్టర్ శెట్టి చెప్పింది నిజమేనా..?

-

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం అభిమానుల్ని షాక్ కి గురి చేసింది. రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే హార్ట్ ఎటాక్ తో పునీత్ రాజ్ కుమార్ మరణించినట్లు తెలిసింది. అయితే హార్ట్ సర్జెన్ డాక్టర్ దేవిశెట్టి ఈ నటుడిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే డాక్టర్ శెట్టి నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేశారా..? లేదా ఇవి కేవలం ఫేక్ వార్తలా..? ఇందులో నిజమెంత అనేది చూస్తే…

puneeth rajkumar

ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇచ్చేవారు రాజ్ కుమార్. అయితే డాక్టర్ శెట్టి ఈ నటుడు బాగా ఫిట్ గా ఉండడానికి ఎక్కువ వర్కౌట్లు చేశారని.. అందుకే మరణించారని చెప్పినట్లు ఒక వార్త వచ్చింది. అదే విధంగా గత కొన్ని ఏళ్ళ నుంచి 8 నుండి 9 మంది దగ్గర వాళ్ళని కోల్పోయానని.. కొందరు సెలబ్రిటీలు కూడా ఉన్నారని వారిలో 40 ఏళ్ల వయసు వాళ్ళు కూడా ఉన్నారని… సిక్స్ ప్యాక్ తో కేవలం బయటకి మాత్రమే ఫిట్ గా వాళ్లు ఉండేవారని డాక్టర్ చెప్పినట్లు మెసేజ్ వైరల్ అవుతోంది.

అయితే ఈసారి పునీత్ రాజ్ కుమార్ కూడా ఈ జాబితాలో చేరారని తను అన్నారని ఒక వార్త వచ్చింది. ఎక్కువగా అయితే ఈ వార్త వాట్సాప్ లో వైరల్ గా మారింది. అయితే దీనిలో నిజమెంత అనేది పరిశీలిస్తే…. డాక్టర్ శెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇది కేవలం ఫేక్ అని వాళ్ళ ఆఫీస్ అంటోంది.

పైగా డాక్టర్ అన్నట్లు ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే డాక్టర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కేవలం ఇది ఫేక్ మెసేజ్ అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మడం మంచిది కాదు. వీలైనంత దాకా ఈ ఫేక్ వార్తల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news