సీఐ ఆత్మహత్య చేసుకున్నాడని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్..!

-

ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ సిఐ రాజులపాటి అంకబాబు తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారని ఫేస్ బుక్ ఖాతాలో ఫేక్ న్యూస్ ని పోస్ట్ చేశారు అగంతకులు. ఈ నేపథ్యంలో ఫేక్ వార్తలు ప్రచురిస్తున్న వ్యక్తిపై కేసుపెడుతూ జిల్లా ఎస్పీ రాహుదేవ్ శర్మను కలిశారు సీఐ అంకబాబు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నారు సీఐ అంకబాబు.

జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం సిఐ అంకబాబు మాట్లాడుతూ.. ఇదంతా ఫేక్ న్యూస్ అని.. దయచేసి ఎవరూ నమ్మవద్దు, నేను క్షేమంగానే ఉన్నానని తెలిపారు సీఐ అంకబాబు. ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే న్యూస్ పోస్ట్ చేసేటప్పుడు నిర్ధారించుకుని పోస్ట్ చేయాలని సూచించారు. అలాగ నిర్ధారించుకోకుండా ఫేక్ న్యూస్ ని ఫార్వర్డ్ చేసిన వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news