ఫేక్ న్యూస్: జనసేన లోకి పిల్లి సుభాష్ చంద్రబోస్ … క్లారిటీ !

-

గత వారం రోజుల నుండి వైసీపీ లో కీలక నాయకుడిగా ఉన్న రామచంద్రపురం నియోజకవర్గం నేత పిల్లి శుభాష్ చంద్రబోస్ కు అదే నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన వేణు కు మధ్యన వచ్చే ఎన్నికలలో సీటు విషయంపై పోరు జరుగుతున్నది. దీని గురించి ఇటీవల సీఎంను కలిసి పూర్తి వివరాలు వెల్లడించారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత నుండి సుభాష్ చంద్రబోస్ పార్టీ మారుతున్నారు అన్న వార్తలు వ్యాపించడంతో స్వయంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ రంగంలోకి దిగారు. నేను జనసేనలోకి మారుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ఖండించారు. నేను మొన్న కలిసినప్పుడు అన్ని విషయాలను సీఎం కు వివరించాను… నా భవిష్యత్తు దృష్ట్యా మంచి నిర్ణయమే తీసుకుంటానని తెలిపారు అంటూ పిల్లి క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ఇస్తారు అన్నది సీఎం జగన్ త్వరలోనే నిర్ణయిస్తారు అంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. దీనితో ఉదయం నుండి వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news