ఏమైంది మ‌చ్చా..?? అల్లు అర్జున్ ను అలా చూసి అభిమానులు షాక్‌? ల‌డ్డులా అయ్యావ్

-

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే.. ఏ హీరో అయినా సరే.. తమ సినిమాలోని పాత్ర కి మంచి అవుట్ ఫుట్ ఇవ్వడానికి దర్శకులు చెప్పినట్టు వింటూ ఉంటారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా రాజమౌళి సలహా మేరకు యమదొంగ సినిమాకు ఏకంగా 30 కేజీల బరువును తగ్గి సినిమాలపై తనకున్న డేడికేషన్ ను నిరూపించారు.

కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు ప్రభాస్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా తమ పాత్రల కోసం తమ మేకోవర్ ను చేంజ్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా.. తాను నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం తన మేకోవర్ ను చేంజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ , సుకుమార్ డైరెక్షన్ లో రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన పుష్ప సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ కూడా రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా కి సంబంధించి షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ కథకు సంబంధించి కొన్ని అంశాలను కూడా అక్కడక్కడ సుకుమార్ హింట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా హరీష్ శంకర్ డైరెక్షన్లో అల్లు అర్జున్, పూజ హెగ్డే తో కలిసి దువ్వాడ జగన్నాథం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. జూన్ 23, 2017 వ తేదీన తెరకెక్కిన ఈ చిత్రం మొన్నటి తో ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది . ఇక ఈ విజయాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్ హైదరాబాద్ కి వచ్చి హరీష్ శంకర్ ను మీట్ అయ్యాడు. ఆ తర్వాత మీడియాతో అభిమానులతో ముచ్చటించి అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇక అల్లు అర్జున్ లుక్ ని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. పుష్ప సీక్వెల్ కోసమే అల్లు అర్జున్ బరువు పెరిగారని ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ లు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సుకుమార్ తో సినిమా అయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news