ఇంటిబాట పడుతున్న రైతులు … సింఘూ బార్డర్ ఖాళీ

-

గత ఏడాది కాలంగా కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. తాజాగా రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడంతో రైతులు సొంతూళ్లకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇటీవల పార్లమెంట్ శీతాకాలం సమావేశాల తొలిరోజే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. దీంతో పాటు రైతుల పలు డిమాండ్లను కేంద్రం అంగీకరించింది.

రైతులు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు మద్దతు ధర హామీ చట్టం, రైతులపై కేసులు ఎత్తివేయడంతో పాటు విద్యుత్ చట్టాలను కూడా రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసులు ఎత్తివేస్తామని.. మద్దతుధర విషయమై కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో రైతులు ఏడాదిగా చేస్తున్న ఉద్యమానికి తెర పడింది.దీంతో రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీచేసి ఇళ్లకు వెళ్తున్నారు. సింఘు బార్డర్, టిక్రి బార్ఢర్లలో టెంట్లు, నివాస స్థలాలను ఖాళీ చేస్తున్నారు. విజయోత్సవంతో ర్యాలీలు చేసుకుంటూ ఇళ్లకు తిరుగు ప్రయాణం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news