వీడియో వైరల్ : భారత్ చైనా సైనికులు రచ్చ రచ్చ..!

-

fight between india and china soldiers
fight between india and china soldiers

భారత్ చైనా ల మధ్య నిప్పు రవ్వ వేస్తే బగ్గుమనేలా భగ్గుమనేలా మారాయి పరిస్థితులు. ఇరు దేశాల సైనికుల మధ్య తాడోతేడో అనేలా ఉంది వాతావరణం. ఇరు దేశాల సైనికులు ప్రతీకారవాంఛతో రగిలిపోతున్నారు, ఇక ఇలాంటి నేపద్యంలో బయటకొచ్చింది ఓ వీడియో. ఇక ఆ విడియోని సైనికులు గనుక చూస్తే ఇక అంతే సంగతులు ఎండుగడ్డి పై నిప్పు వేసినట్టే..

గడ్డకట్టించే సిక్కిం ప్రాంతంలో ఏదో ఎత్తయిన ప్రదేశం పైగా లడఖ్ సమీపం ఇక ఆ ప్రాంతంలో ఇరు దేశ సైనికుల మధ్య ఘర్షణ మొదలయ్యింది. ఇరు దేశ జవాన్ల మధ్య వాగ్వాదం పెరిగి ఒక్కసారిగా పిడిగుద్దులు గుద్దుకోవడం ప్రారంభించారు. ఇరు పక్షాలూ “గో బ్యాక్”, “డోంట్ ఫైట్” అన్న నినాదాలు ఈ వీడియోలో వినిపిస్తున్నాయి. కొంతసేపటి తరువాత వివాదం సద్దుమణిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news