టాలీవుడ్ లో మరో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.

తాజాగా కొల్లిపర గ్రామానికి చెందిన సినీ నిర్మాత రామిరెడ్డి మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. రామ్ రెడ్డి నిర్మాతగా స్టువర్టుపురం దొంగలు శత్రువు లేడి బ్యాచిలర్స్ తదితర సినిమాలు తీశారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించారు. ఇక బుధవారం రామిరెడ్డి భౌతిక కాయాన్ని స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news