ఈవారం థియేటర్లు, ఓటిటిలో విడుదల కానున్న చిత్రాలు..

-

ఈవారం థియేటర్లు,ఓటిటి లో పలు చిత్రాలు సందడి చేయడానికి సిద్ధం అయ్యాయి. థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు..” శేఖర్”.. రాజశేఖర్ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం శేఖర్. జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. వీరి పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రను పోషించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఈ చిత్రం మే 20న థియేటర్లలో సందడి చేయబోతుంది. “దగడ్ సాంబా”..బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, సోనాక్షి జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ఎస్ ఆర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జ్యోతి చలాకి చంటి మిర్చి మాధవి తదితరులు నటించారు.

“దాకడ్”.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన సినిమా ట్రైలర్ కు ఇప్పటికే ఎంతో స్పందన లభించింది. ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.” భూల్ భులయ్యా” 2.. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ఇది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 20న థియేటర్లలో విడుదల కాబోతుంది.. ఇక ఓటీటి లో విడుదల కాబోతున్న చిత్రాలు…”ఆర్ఆర్ఆర్”.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మే 20న జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.”ఆచార్య”.. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా మే 20న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.” భళా తందనానా”.. శ్రీ విష్ణు, కేథరిన్, గరుడ రామ్ పోసాని కృష్ణమురళి నటించిన ఈ చిత్రం ఈనెల 20న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news