కేసీఆర్ క్యాబినెట్ లో పనికారాని, పనిలేని మంత్రులు ఉన్నారు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

-

అమిత్ షా సభ తర్వాత టీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదు, తినడం లేదని… బంగారు గిన్నెల జీవితం ప్రారంభించిన కేటీఆర్ కు పేదల కష్టాలు ఏం తెలుస్తాయని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అత్యంత అవినీతి, అసమర్థ, బాధ్యతరాహిత్య మంత్రి కేటీఆర్ అని విమర్శించారు. ఏసీబీ ట్రాప్ చేసిన వారిలో ఎక్కువ మంది పురపాలక శాఖకు చెందిన ఉద్యోగులే ఉన్నారని ఆయన అన్నారు. కేటీఆర్ మంత్రిత్వ శాఖలోనే కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తండ్రి కొడుకుల పాలనలో పురపాలక శాఖ భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు. ప్రపంచ దేశాలతో ప్రశంసించబడుతున్న వ్యక్తి మోదీ అని ఆయన అన్నారు. ఆయననా మీరు విమర్శించేది అని ప్రశ్నించారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో అబద్ధం ఏముందని ఆయన అడిగారు. వంచించడం, మోసం చేయడం కెసిఆర్ కుటుంబానికే చెల్లిందన్నారు. హాస్పిటల్స్ లో 5 రూపాయల భోజనం పెట్టాలనేది 8 సంవత్సరాల తర్వాత గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. బిజెపి నీ విమర్శిస్తే సహించేది లేదు… వెంట పడి తరిమి తరిమి కొడతాం అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news