ముషీరాబాద్‌ టింబర్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం

-

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముషీరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న ఓ టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ డిపోలో భారీగా కట్టెలు ఉండటంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో డిపో యజమాని, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు డిపో యజమాని తెలిపారు. టపాసులు కాల్చడం వల్లే ఆ నిప్పులతో మంటలు వ్యాపించాయా? లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news