విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. తగలడిపోయిన థియేటర్

-

విజయవాడ లో ఘోర అగ్నిప్రమాదం సంచలనం సృష్టిస్తోంది. విజయవాడలోని చిట్టినగర్ లో ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్ట్ సమీపాన ఉన్న ప్రసాద్ థియేటర్ లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే కరోనా లాక్ డౌన్ వలన చాలా రోజులుగా ఈ ధియేటర్ మూసి వేసి ఉంచినట్లు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు సంభవించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ప్రస్తుతానికి మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా రోజులుగా ఈ థియేటర్ మూతపడి ఉండడంతో లోపల మనుషులు ఎవరూ లేరని భావిస్తున్నారు. దీంతో ప్రాణ నష్టం కూడా ఏమీ ఉండకపోవచ్చు అని సమాచారం. అయితే భారీగా ఆస్తి నష్టం మాత్రం జరిగి ఉంటుందని చెబుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే గానీ ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే విషయం మీద ఏమీ చెప్పలేమని థియేటర్ యాజమాన్యం చెబుతోంది. ఈ విషయం మీద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news