ఆర్మీ కి కూడా పాకింది…. తోలి కరోనా కేసు నమోదు!

-

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా ఇప్పుడు భారత్ లో కూడా బాగా ప్రబలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా పలు కరోనా కేసులు నమోదు కాగా ఈ మహమ్మారి ని నియంత్రించడానికి భారత సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయితే తాజాగా ఈ కరోనా వైరస్ ఇండియన్ ఆర్మీ కు కూడా పాకడం కలవర పెడుతుంది. లద్దాఖ్ స్కౌట్స్ లో పనిచేసే జవాన్ కు కోవిడ్-19 సోకినట్లు తెలుస్తుంది. అతని తండ్రి ఇటీవల ఇరాన్ లో పర్యటించి ఇండియాకు తిరిగొచినట్లు సమాచారం. అయితే ఆయనకు కూడా కరోనా టెస్ట్ లు చేయడం తో జవాన్ తండ్రి కికుడా పాజిటివ్ అని తేలడం తో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జవాన్ కుటుంబం లో మిగిలిన వారికి కూడా ఈ వైరస్ సోకి ఉంటుంది అని భావించిన అధికారులు మిగిలిన కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వైరస్ తీవ్రత పెరగకుండా ఇండియన్ ఆర్మీ అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటివరకు ఈ కరోనా ఐటీ వారిని అలానే వారి నుంచి ఇతరులకు పాకుతూ వచ్చింది. అయితే తాజాగా ఆర్మీ జవాన్ కు కూడా ఈ కరోనా పాజిటివ్ రావడం తో అధికారులు తగు చర్యలు చేపట్టారు.

చైనా లో మొదలైన ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 6 వేల మందికి పైగా మృతి చెందగా, లక్షలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చైనా లో మొదలైన ఈ కరోనా ప్రభావం ఇప్పుడు ఇరాన్,ఇటలీ,యూరప్ దేశాల్లో ఎక్కువగా ఉంది. దీనితో ప్రపంచ దేశాలు అప్రమత్తమై విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news