ఐపీఎల్ స్పాన్సర్​షిప్​ రేసులో భారత్​కు చెందిన ఐదు సంస్థలు

-

ఈ ఏడాదికి ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకున్న ‘వివో’ స్థానంలోకి వచ్చేందుకు టాటా మోటార్స్‌, డ్రీమ్‌ ఎలెవన్‌, అన్‌అకాడమీ సంస్థలు ఆసక్తి చూపించాయి. ఇవి మూడూ ఐపీఎల్‌-13 టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం శుక్రవారం బిడ్‌లు వేశాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ బిడ్‌లు దాఖలు చేయడానికి శుక్రవారమే ఆఖరి రోజు. వీటితో పాటు ఐపీఎల్‌-13 టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం రేసులో జియో, బైజూస్​ సంస్థలు కూడా ఉన్నాయని సమాచారం.

Ipl
Ipl

ఈ నెల 18న స్పాన్సర్​షిప్​ బిడ్‌లు తెరుస్తారు. దేశంలో కొన్ని నెలలుగా చైనా వ్యతిరేక ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన వివో ఈ ఏడాదికి ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకుంది. ఆ సంస్థ ఏటా బీసీసీఐకి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది వరకు వేరుగా ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్న బోర్డు.. టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం ద్వారా రూ.300 కోట్ల మేర అయినా వస్తాయని ఆశిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news