చొప్పదండి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. 50 మందికి విద్యార్థులకు అస్వస్థత

-

కరీంనగర్ జిల్లా చొప్పదండి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఈ చొప్పదండి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరగడంతో ఏకంగా 50 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత నెలకొంది. వాంతులు, విరేచనాలతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ విషయం తెలియగానే.. సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ యాజమాన్యం అప్రమత్తమైంది.

దీంతో ఆ 50 మంది విద్యార్థులను కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం కరీంనగర్ ఏరియా ఆసుపత్రిలో యాభై మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. అయితే ఇందులో పలువురి పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు… ఫుడ్ పాయిజన్ ఇలా జరిగింద  నే కోణం లో … దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news