చత్తీస్‌గఢ్ మాజీ మంత్రి రాజీందర్ పాల్‌సింగ్ ఆత్మహత్య

-

ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రంలో ఓ మాజీ మంత్రి సుసైడ్‌ చేసుకున్నారు. ఆయన పేరు రాజీందర్‌ పాల్‌ సింగ్‌. ఈ ఏడాది మార్చి లో కరోనా బారిన పడిన ఆయన.. చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే.. ఆ తర్వాతి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌నంద్‌ గావ్‌ జిల్లా చురియా పట్టణంలో తన నివాసంలో భాటియా ఫ్యాన్‌ కు ఉరేసుకుని సుసైడ్‌ చేసుకున్నారని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఇక మరో వైపు, ఆయన నివాసం నుంచి సూసైడ్‌ నోట్‌ లభించిందా ? లేదా ? అన్ని విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు. రాజీందర్‌ భార్య కొన్నేళ్ల క్రితమే చనిపోగా… ఆయన కుమారుడు జగ్జీత్‌ సింగ్‌ భాటియా రాయ్‌ పూర్‌ లో ఓ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. రాజీందర్‌ పాల్‌ ఖుజ్జి అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన రాజీందర్‌.. సీఎం రమణ్‌ సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ తొలి ప్రభుత్వం లో వాణిజ్య శాఖ సహాయ మంత్రి పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news