మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తికి గుండెపోటు

-

విశాఖపట్నం: మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతికి గుండెపోటు వచ్చింది. ప్రతిభా భారతి తండ్రి జస్టిస్‌ పున్నయ్య(92) అనారోగ్యంతో విశాఖలోని పినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని చూసేందుకు శుక్రవారం ఆస్పత్రికి వచ్చిన ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అదే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రతిభా భారతి పరిస్థితి విషమంగా ఉందని, షుగర్‌ లెవల్స్‌ బాగా తగ్గిపోయాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతిభా భారతికి తండ్రితో అనుబంధం ఎక్కువని.. ఆయన పరిస్థితి చూసి ఆందోళనకు గురికావడంతోనే గుండెపోటు వచ్చిందని ఆమె కుమార్తె గ్రీష్మా ప్రసాద్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news