బండెనక బండి గట్టి… కొంగరకొలాన్ కు దారి పట్టి

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఉత్సాహంతో ఆదివారం జరగనున్న ప్రగతి నివేదన సభకు బండెనక బండి గట్టి బయలుదేరారు. ఖమ్మం ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 1890 ట్రాక్టర్లతో దాదాపు 25 కిలోమీటర్ల పొడవు గల రైతన్నల వాహన శ్రేణి ప్రయాణం  శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం  నుంచి హైదరాబాద్ దారి పట్టింది. ఈ ప్రయాణాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.

గడచిన నాలుగున్నరేళ్ల పాటు రైతు సేవలో సాటి రైతుగా నిమగ్నమైన సీఎం కేసీఆర్ కి స్వయాన ధన్యవాదాలు తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభకు బయలుదేరడం అభినందనీయమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జడ్పీ చైర్మపర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తక్కెళ్లపల్లి రవీందర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news