తొందరపడి ఒక ఎమ్మెల్యే ముందే కూసిండు..!

-

నిజమే.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రగతి నివేదన సభను జరిపించబోతున్నది. సెప్టెంబర్ 2న అంటే రేపే ప్రగతి నివేదన సభ జరగనుంది. 25 లక్షల మందికి పైగా జనాలు, కార్యకర్తలు, టీఆర్‌ఎస్ శ్రేణులు సభకు హాజరవుతారని టీఆర్‌ఎస్ అంచనా వేసింది. ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ ప్రాంత ప్రజలను తండోపతండాలుగా తరలించేలా ప్రణాళికలు రెడీ చేశారు. ఇప్పటికే కొంతమంది కొంగరకలాన్ బాట పట్టారు.

ఇక.. ఇదే సమయమనుకొని.. పెద్ద బాసు సీఎం కేసీఆర్ కంట్లో పడటానికి.. తాము ఇంత చేశాం. అంత చేశాం.. అని సారు ముందు ఫోజు కొట్టడానికి కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు తెగ ప్రయత్నిస్తున్నారు. ఆకోవలోకే వస్తుంది మీరు పైన చూస్తున్న ఫోటో. చూశారుగా.. అరె.. నవ్వుతున్నారెందుకు.. కాసేపు ఆగండి. అరె.. చెబితే వినరేం. కాస్త నవ్వు ఆపి ముందు చెప్పేది వినండి.

ప్రగతి నివేదన సభ ప్రారంభం కూడా కాలేదు. రేపు ప్రారంభం అవుతుంది. కానీ.. ఈ ఎమ్మెల్యే మాత్రం ప్రగతి నివేదన సభను విజయవంతం చేసిన అతిరథ మహారథులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదములు అంటూ పేద్ద హోర్డింగ్ ఏర్పాటు చేయించాడు. పెద్ద సారు దృష్టిలో పడాలనుకోవడంలో తప్పు లేదు కానీ.. మరీ ఇలానా. ఇక.. ఈ ఫోటోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి.. అది కాస్త వైరల్‌గా మారింది. ఇక.. నెటిజన్లు.. ఊరుకుంటరా? ఏంది సారు.. ఇట్లా తొందరపడితివి.. ఇంకా సభ కూడా పూర్తి కాకముందే ఇంత తొందరేంది నీకు.. నీకు ఎట్లాగు ఎమ్మెల్యే టికెట్ ఖాయమేనాయె.. మళ్లీ ఈ దువ్వుడు కార్యక్రమం ఎందుకు.. అంటూ వాళ్లకు నచ్చిన కామెంట్లు పెడుతున్నరు. పెడితే పెడితివి హోర్డింగ్ కాని.. ఇంకో రెండు మూడు రోజులు ఆగి పెడితే ఏంపోయె.. అంటూ ఎమ్మెల్యేపై ఫైర్ అవుతున్నారు ఇంకొందరు.

Read more RELATED
Recommended to you

Latest news