ఏపీలో మహిళలకు ఉచిత బస్ …. కీలక వ్యాఖ్యలు చేసిన రవాణా శాఖ మంత్రి

-

ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఉచిత బస్ హామీ కొంచెం లేటైనా నెరువేర్చుతామని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఏపీలో అమలు చేస్తామని వెల్లడించారు. మేము కక్ష సాధింపులకి పోమని ఆయన పేర్కొన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్, ఇసుక అన్ని రంగాల్లో అవినీతి చేశారని మండిపడ్డారు. కూలీ కుటుంబం నుండి వచ్చిన పెద్దిరెడ్డి ఇప్పుడు రాయలసీమను శాసించే స్థాయికి ఎదిగేంత అవినీతి చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ హయాంలో మంత్రులలాగా గంగిరెద్దుల్లా తలవూపుకుంటూ మేము పని చెయ్యమని.. మంత్రులకు చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్చ ఇచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా సొమ్ము తిన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news