నేటి నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్..టోల్‌ ఫ్రీ నంబర్లు ఇవే

-

నేటి నుంచి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఏ విధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తు న్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హజరు కానున్నారు. 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశారు.జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఏర్పాట్లు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2011 సంవత్సరం తర్వాత మళ్ళీ జరుగుతున్నాయి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు. హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేశారు. TGPSC కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బంది నియామకం చేశారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతి లేదని తెలిపారు. ఒకటిన్నర గేట్స్ క్లోజ్ అవుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా కేటాయింపులు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సదుపాయం కల్పించారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news