టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గంభీర్?

-

టీమిండియా తదుపరి ప్రధాన కోచ్‌ ఎంపికపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగిస్తుండడంతో ఆ తర్వాత ఈ స్థానం ఖాళీ అవుతుంది. దీంతో బీసీసీఐ ఇప్పటికే తదుపరి ప్రధాన కోచ్ కోసం అన్వేషణను ప్రారంభించింది. ఈ క్రమంలోనే భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్‌ను టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే దీనిపై బోర్డు అధికారులు ఆయనను సంప్రదించినట్లు ESPN cricinfo తెలిపింది. ప్రస్తుతం గంభీర్ ఐపీఎల్లో కేకేఆర్ మెంటార్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ పూర్తయిన తర్వాత కోచ్ పదవిపై అతనితో బీసీసీఐ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news