పంజాబ్ లో దారుణం.. బాలిక‌కు మ‌త్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్

-

దేశంలో మ‌హిళ‌ల‌పై రోజు రోజుకు అఘాత్యాలు పెరిగిపోతున్నాయి. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా.. మానవ మృగాలు త‌మ కామ వాంఛ‌ను తీర్చుకుంటున్నాయి. చిన్న చిన్న పిల్ల‌ల‌పై కూడా త‌మ కామ క్రీడా ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో బాలిక‌ల‌పై గ్యాంగ్ రేప్ లు విచ్చ‌ల విడిగా జ‌రుగుతున్నాయి. తాజా గా పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని ఓ వ్య‌క్తికి సోషల్ మీడియాలో ఒక బాలిక ప‌రిచ‌యం అయింది. ఆ ప‌రిచయాన్ని ప్రేమగా మార్చాడు. త‌న‌ను క‌ల‌వ‌డానికి రావాల‌ని ప్ర‌తి రోజు ఫోన్లో చెప్పేవాడు. దీంతో ఆ బాలిక‌.. పంజాబ్ లోని త‌ల్వారా బ‌స్ స్టాప్ కి వ‌చ్చింది.

అప్ప‌టికే ప‌థ‌కంతో ఉన్న ఆ దుర్మార్గుడు.. ఆ బాలిక‌ను కారులో ఎక్కించుకున్నాడు. మ‌రో ముగ్గురు స్నేహితుల‌ను కూడా వెంట తెచ్చుకున్నాడు. వీళ్లు ఎందుకు అని బాలిక గొడ‌వ చేస్తే.. ఆమెకు మ‌త్తు మందు ఇచ్చారు. అనంత‌రం నిర్మాన్యుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ న‌లుగురు కిరాత‌కులు గ్యాంగ్ రేప్ చేశారు. త‌ర్వాత బాలిక‌ను కారులో బ‌స్టాండ్ లో దింపి వెళ్లారు. జ‌రిగిన విషయం బాలిక త‌న కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నలుగురు నిందితుల‌పై పోక్సో చ‌ట్టం కింద కేసు తో పాటు కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కేసులు న‌మోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news