కేరళలో దారుణం… ఫోటో షూట్ కోసం వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్..

-

కేరళలో దారుణం జరిగింది. నమ్మి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచాారానికి పాల్పడ్డారు దుర్మార్గులు. 27 ఏళ్ల మోడల్ పై మూడు రోజులు గ్యాంగ్ రేప్ చేశారు. సదరు యువతి విడియోలు తీసి భయపెట్టారు. దీంతో బాధితురాలు పోలీసుకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే .. కేరళలోని కొచ్చిన్ లో ఈ ఘటన జరింది. ఈ గ్యాంగ్ రేప్ ఘటనలో మొత్తం నలుగురు నిందితులుగా కాగా.. ముగ్గురు నిందితులు సదరు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనలో ప్రధాన నిందితుడు అయిన అజ్మల్ బాధిత యువతికి స్నేహితుడు. ఇతడితో పాటు మరో ఇద్దరు యువతిపై రేప్ కు పాల్పడగా.. మరో యువతి వీరికి సహరించింది. మనప్పురం  నుంచి ఫోటో షూట్ కోసం కొచ్చిన్ వచ్చిన యువతికి కక్కనాడ్ ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస ఏర్పాటు చేశారు. అయితే యువతి తాగిన కూల్ డ్రింక్స్ లో డ్రగ్స్ కలిపి డిసెంబర్ 1 నుంచి 3 వరకు అత్యాచారానికి పాల్పడ్డారు. రేప్ తర్వాత బాధిత యువతి వీడియోలు తీసి బెదిరించారు.  వీరికి లాడ్జి ఓనర్ క్రిస్టినా కూడా దీనికి సహరించిందిని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుల్లో ఒకరు 33 ఏళ్ల సలీం కుమార్ పోలీసుకు పట్టుబడ్డాడు. ప్రధాన నిందితుడు అజ్మల్, మరో నిందితుడు సమీర్ లు పరారీలో ఉన్నారు.

పోలీసులు రేప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఘటనతో సంబంధం ఉండీ, ప్రస్తుతం దొరికిన నిందితుడికి కోర్ట్ జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. మరో ఇద్దరు నిందితులతో పాటు లాడ్జ్ ఓనర్ పరారీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news