ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం… మెడికల్ షాపుకు వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం

-

ప్రతీ రోజు దేశంలో అత్యాచారాలు ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తున్నవారు కొందరైతే.. మరికొంత మంది పరువు కోసం సైలెంట్ గా ఉంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దిశ, నిర్భయ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధులు దుర్మార్గాలకు తెగబడుతున్నారు. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్తే సురక్షితంగా వస్తారన్న గ్యారెంటీ లేకుండా పోతోంది.

తాజాగా ఇలాంటి ఘటనే… ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మెడికల్ షాపుకు వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ బుద్గాం జిల్లాలో చోటు చేసుకుంది. మెడిసిన్ కొనేందుకు సమీపంలో ని దుకాణానికి వెళ్లిన మహిళపై కన్నెసిన నలుగురు నిందితులు… ఆమెను బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం నిందితులు పారిపోయారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news