పోలీసుల అదుపులో గ్యాంగ్​స్టర్​ నయీం ప్రధాన అనుచరుడు

-

ఓ సెటిల్మెంట్ చేస్తుండగా పోలీసులు గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్నను అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేటలోని ఓ రెస్టారెంట్ లో సెటిల్ మెంట్ చేస్తుండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం దాడి చేసిన పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శేషన్న నుంచి ఓ పిస్తోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అచ్చంపేటకు చెందిన శేషన్న.. కొంతకాలం పీపుల్స్ వార్ గ్రూపులో పని చేసి ఆ తర్వాత లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు.

అప్పటి నుంచి నయీం ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ బెదిరింపులు, హత్యలు, హత్యాయత్నాల వంటి అనేక కేసుల్లో నయీంతో పాటు శేషన్న కూడా నిందితుడుగా ఉన్నాడు. 2016లో షాద్​నగర్​లో జరిగిన ఎంకౌంటర్​లో నయీం మృతి చెందగా.. అప్పటి నుంచి శేషన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్నాళ్లకు సరైన సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శేషన్నను పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news