వైసీపీలోకి గంటా.. కీలక ప్రకటన చేసిన విజయసాయి రెడ్డి !

-

ఈరోజు విశాఖలో విజయసాయిరెడ్డి సమక్షంలో గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన చూసి కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారు అని ఆయన అన్నారు. సంవత్సరం క్రితం ఆయన వైసీపీలో చేరాలి అని కానీ కొన్ని కారణాలు వలన అవ్వలేదని అన్నారు. జిల్లా వైసీపీ నాయకులందరు మనస్ఫూర్తిగా కాశీ విశ్వనాథ్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని అన్నారు.

కొన్ని నిర్ణయాలు కొంత మందికి నచ్చకపోవచ్చని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని అన్నారు. ఇక గంటా శ్రీనివాసరావు కూడా పార్టీలో చేరేందుకు గతంలో కొన్ని ప్రతిపాదనలు పంపించారని అన్నారు. గంటా కూడా వైసీపీ వైపు ఆకర్షితులవుతున్నారని కానీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయమే ముఖ్యం అని అన్నారు. పార్టీని బలోపేతం చేసుకుని జీవిఎంసి ఎన్నికల్లో విజయం సాధించాలని అన్నారు. ఇక కొద్ది నెలల క్రితం కాశీ విశ్వనాథ్ కు చెందిన గో కార్టింగ్ ట్రాక్ మొత్తాన్ని మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news