BREAKING : సామాన్యులకు షాక్‌..మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

-

దేశంలోని సామాన్య ప్రజలకు ఆయిల్ కంపెనీలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా 104 రూపాయలను పెంచేశాయి. దీంతో హైదరాబాద్ నగరంలో కమర్షియల్ సిలిండర్ ధర 2563 రూపాయలకు చేరింది.

అలాగే వైజాగ్ లో 2413 రూపాయలకు, విజయవాడలో రూ. 2501 లకు చేరాయి. ఇక 14 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర పై ఎలాంటి మార్పు లేదు. దీంతో సామాన్య ప్రజలకు కాస్త ఊరట కలిగింది. ప్రతినెల ఒకటో తేదీన దేశంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తూ ఉండగా… తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గత నెలలో కూడా కమర్షియల్ సిలిండర్ ధర పెరిగిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news